ఒడిశాలోని మల్కన్​గిరి జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. పోలీసు ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్నారనే అనుమానంతో ముగ్గురిని ఇంటి నుంచి లాక్కెళ్లి చిత్రహింసలకు గురిచేశారు. ఓ వ్యక్తిని గొంతు కోసి హత్య చేశారు. మరో ఇద్దరిని చితకబాది వదిలేశారు.సుమారు 15 మంది మావోయిస్టులు ముగ్గురిని ఊరి శివార్లకు లాక్కెళ్లి, ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.


సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్షకు తరలించారు. చనిపోయిన వ్యక్తిని దాసు ఖేముడుగా గుర్తించారు. మావోయిస్టుల కోసం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు.పోలీసు ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్నారనే నేపంతోనే ముగ్గురిని లక్ష్యంగా చేసుకున్నారని గ్రామస్థులు తెలిపారు. అందుకే ఇంటి నుంచి లాక్కెళ్లి చిత్రహింసలకు గురిచేశారని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: