ఉత్తర్​ప్రదేశ్​లో అత్యాచార నిందితులపై కఠినంగా వ్యవహరిస్తోంది పోక్సో న్యాయస్థానం. ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడి కేసులో.. జీవిత ఖైదు విధించారు ప్రత్యేక న్యాయమూర్తి వీణా నారాయణ్. అంతేకాకుండా దోషికి రూ. 2లక్షలు జరిమానా కట్టాలని కూడా తీర్పునిచ్చారు. ఈ మేరకు శిక్షను ధ్రువీకరిస్తూ.. పబ్లిక్​ ప్రాసిక్యూటర్​ హరేంద్ర త్యాగి ఆరోపణలు చేసిన 22 రోజుల్లోనే తీర్పు ఖరారు కావడం గమనార్హం.


అమ్రోహ జిల్లాలో ఆగస్టు 6న.. ఆరేళ్ల బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి, అత్యంత కిరాతకంగా హతమార్చాడు దళపత్​ అనే నిందితుడు. ఈ కేసులో అదే నెల 14న నిందుతుణ్ని అరెస్ట్​ చేశారు పోలీసులు.2018లో అమ్రోహ జిల్లాలో 12ఏళ్ల బాలికపై హత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో భాగంగా ఈ నెల 15న ఇద్దరు దోషులకు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: