భారత వాయుసేన తొలి మహిళా​ అధికారి, వింగ్​ కమాండర్​ (రిటైర్డ్​) డాక్టర్​ విజయలక్ష్మీ రమణన్​(96) కన్నుమూశారు. బెంగళూరులోని తన కుమార్తె నివాసంలో ఉంటున్న ఆమె.. ఆదివారం తుదిశ్వాస విడిచినట్లు ఆమె అల్లుడు ఎస్​ఎల్​వీ నారాయణ్​ తెలిపారు.విజయలక్ష్మీ రమణన్​ 1924 ఫిబ్రవరిలో జన్మించారు. ఎంబీబీఎస్​ పూర్తి చేశారు. 1955 ఆగస్టు 22న సైనిక వైద్య విభాగంలో నియమితులయ్యారు. అదే రోజు వాయుసేనలోకి వెళ్లారు.


వాయుసేనకు చెందిన వివిధ ఆసుపత్రుల్లో గైనకాలజిస్ట్​గా సేవలందించిన ఆమె.. యుద్ధాల సమయంలో గాయపడిన సైనికులకూ వైద్యం చేశారు. అలాగే కార్యనిర్వాహక విధులనూ నిర్వర్తించారు.1972 ఆగస్టులో వింగ్​ కమాండర్​ ర్యాంకుకు పదోన్నతి పొందారు రమణన్​. ఐదేళ్ల తర్వాత విశిష్ట సేవా మెడల్​ అందుకున్నారు. 1979 ఫిబ్రవరిలో పదవీ విరమణ చేశారు.ఆమె భర్త కేవీ రమణన్​ కూడా వాయుసేనలో సేవలందించారు. వారికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. యుక్త వయసులో ఆల్​ ఇండియా రేడియోలో ఆర్టిస్ట్​గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రమణన్​.

మరింత సమాచారం తెలుసుకోండి: