ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దక్షిణ కొరియా ప్రధాని మూన్ జే ఇన్​తో ఫోన్​లో సంభాషించారు. కరోనా మహమ్మారిపై పోరులో పురోగతి సహా కీలకమైన అంతర్జాతీయ అంశాలపై ఇరుదేశాధినేతలు మాట్లాడుకున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.పారదర్శక, అభివృద్ధి-నిబంధనల ఆధారిత అంతర్జాతీయ వర్తకాన్ని కాపాడుకోవాల్సిన అవసరంపై ఇరువురు నేతలు చర్చించారని పీఎంఓ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రాముఖ్యంపై సమాలోచనలు జరిపినట్లు పేర్కొంది.


మూన్​ జే ఇన్​తో సంభాషణ అనంతరం ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. వివిధ అంశాలతో పాటు కొవిడ్ తదనంతర పరిస్థితుల్లో భారత్-దక్షిణ కొరియా మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించినట్లు తెలిపారు.చర్చించిన అంశాలపై సంప్రదింపులు కొనసాగించాలని ఇరువురు నేతలు నిర్ణయించారని పీఎంఓ తెలిపింది. అన్ని రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు మరింత ముందుకు తీసుకెళ్లాలని తీర్మానించినట్లు వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: