ఘటన జరిగిన ప్రాంతాన్ని సీఎం జగన్ పరిశీలించారు దుర్గ గుడి చైర్మన్ పైలా సోమినాయుడు  వెల్లడించారు. కొండ చరియలు విరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని ఆయన తెలిపారు. ఆలయ అభివృద్దికి సీఎం జగన్ 70కోట్లు మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు అని అన్నారు. కొండచరియలు తొలగించడం సహా ఆలయాన్ని అభివృద్ది చేస్తాం  అని చెప్పారు.

దుర్గ గుడి ఈవో సురేష్ బాబు మాట్లాడుతూ... కొండ చరియ విరిగి పడిన ఘటనలో ముగ్గురు గాయపడ్డారు అని అన్నారు. దేవస్థాన అధికారి,ఒక  పోలీసు, పారిశుద్ద్య కార్మికురాలు గాయపడ్డారు అని చెప్పారు. ఘటనలో ఎవరైనా చనిపోయినట్లు మాకు సమాచారం లేదు అని అన్నారు. కొండ చరియల కింద ఎవరూ లేరని అనుకుంటున్నాం అన్నారు. కొండ చరియలు విరిగి పడిన ఘటనలో ఎక్కడా అధికారుల  నిర్లక్ష్యం లేదు అని స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: