గత రెండు మూడు రోజుల నుంచి తెలంగాణా పోలీసులకు చుక్కలు చూపిస్తున్న కిడ్నాప్ వ్యవహారం సుఖాంతం అయింది. 9 ఏళ్ళ బాలుడు దీక్షిత్ రెడ్డి  కిడ్నాప్ కేసుని తెలంగాణా పోలీసులు చేధించారు.  పోలీసుల అదుపులో  కిడ్నాపర్ ఉన్నాడు. మహబూబా బాద్ లో బాలుడ్ని నాలుగు రోజుల క్రితం కిడ్నాప్ చేసారు. కిడ్నాపర్ నుంచి క్షేమంగా బాలుడ్ని రక్షించారు.

ఉదయం 11 గంటలకు బాలుడిని మీడియా ముందు ప్రవేశ  పెడతారు పోలీసులు. పోలీసుల అదుపులో కిడ్నాపర్ ఉన్నాడు. ఇప్పటి వరకు అతను 15 సార్లు ఇంటర్నెట్ ఫోన్ కాల్ చేసాడు. అతను ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నాడు ఏంటీ అనేది అర్ధం కాలేదు. అయితే ఎలా చేధించారు ఏంటీ అనే విషయంలో మాత్రం  ఇంకా స్పష్టత లేదు. 11 గంటల మీడియా సమావేశంలో దీనికి సంబంధించి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: