గత వారం రోజులుగా  మహబూబా బాద్ పోలీసులతో పాటుగా తెలంగాణా పోలీసులకు చుక్కలు చూపిస్తున్న జర్నలిస్ట్ రంజిత్ రెడ్డి  కుమారుడు దీక్షిత్ రెడ్డి కిడ్నాప్ కేసు  విషాదాంతం అయింది. దీక్షిత్ ని  తిరిగి ఇవ్వాలి అంటే 45 లక్షలు ఇవ్వాలి అని డిమాండ్ చేసారు. ఆ తర్వాత నుంచి ఇంటర్నెట్ కాల్స్ చేస్తూ తల్లి తండ్రులను బెదిరించారు. బాలుడి వయసు 9 ఏళ్ళు.

45 లక్షలు ఇవ్వడానికి తల్లి తండ్రులు అంగీకరించారు. అయినా సరే వాళ్ళు కనికరించలేదు. పోలీసుల అదుపులో నలుగురు నిందితులు ఉన్నారు. బంధువులు మనోజ్  రెడ్డి, సాగర్ సహా మరో ముగ్గిరిపై పోలీసులు కేసు నమోదు  చేసారు. అయితే ఈ రోజు ఉదయం బాలుడి కిడ్నాప్ సుఖాంతం అయింది అని అందరూ భావించారు.  పోలీసులు 11 గంటలకు మీడియా ముందు బాలుడ్ని చూపించే అవకాశం ఉందని అన్నారు. ఇంతలోనే ఈ ఘటన జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: