ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేసి 5 ఏళ్ళు అయిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి. తాజాగా టీడీపీ నేత  బొండా ఉమా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ప్రధాని శంకుస్ధాపన చేసిన అమరావతిని జగన్ నాశనము చేశారు అని అన్నారు. అమరావతి లో 310 రోజుల గా రైతులు పోరాడుతున్నా జగన్ పట్టించు కోవడం లేదు అని చెప్పారు.

రైతులను క్షోభ పెట్టిన ఏ ప్రభత్వమూ బాగుపడలేదు అని మండిపడ్డారు. లేని ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో అమరావతిని నాశనము చేశారు అని అన్నారు. 3000 కోట్లు కర్చు పెట్టీ వుంటే అమరావతి పూర్తి అయ్యేదని అన్నారు. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయటానికి తీయటానికి వేల కోట్లు ఖర్చు పెట్టారు అని అన్నారు. ఒక్క అమరావతిని కట్టలేని వాళ్ళు 3 రాజధానులు ఎక్కడ కడతారో అని ఆయన ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: