తెలంగాణా తొలి హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి మరణంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాళి అర్పించారు. కార్మిక నాయకుడు, తెలంగాణవాది, మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి గారి మరణం కార్మిక వర్గానికి, తెలంగాణ వాసులకు తీరని లోటు అని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తపించిన నిబద్ధత కలిగిన ఉద్యమకారుడు అని ఆయన చెప్పారు.

తెలంగాణ ఉద్యమం తొలి, మలి దశలలో ఆయన గణనీయమైన పాత్ర ఎన్నటికీ మరువలేము అని అన్నారు. కార్మిక నాయకునిగా రాజకీయ జీవితం ప్రారంభించి మూడుసార్లు ఎం.ఎల్.ఎ.గా, ఒక పర్యాయం ఎం.ఎల్.సి.గా ప్రజలకు అమూల్యమైన సేవలు అందించారని అన్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోను, తెలంగాణ ఆవిర్భావం తరువాత మంత్రిగా ఆయన పని చేసి ప్రజలకు సేవలందించారని చెప్పారు. ఆయన ఆత్మకు భగవంతుడు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను అన్నారు. నరసింహారెడ్డి గారు  కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: