దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్ కీలక సూచనలు చేసారు. కోవిడ్ తర్వాత ప్రారంభమైన రైళ్లకు అదనంగా దసరా నేపథ్యంలో 196 జతల ప్రత్యేక రైళ్లను ప్రకటించింది అని చెప్పారు. దక్షిణ మధ్య రైల్వే నుండి 42 ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి అని అన్నారు. ఈ రైలు ఈ నెల 20 - నవంబర్ 30 వరకు ఈ ప్రత్యేక రైళ్ళు నడుస్తాయి అని చెప్పారు. దీనిలో జనరల్ కేటగిరి ఉండవని చెప్పారు.

ఈ ప్రత్యేక రైళ్లు కాబట్టి రిజర్వేషన్ ద్వారా మాత్రమే టికెట్ బుక్ చేసుకోవచ్చు అని అన్నారు. ఇప్పటికే అన్ని కౌంటర్లలో రిజర్వేషన్లు బుకింగ్ ప్రారంభమైంది అని అన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రైళ్లు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇక్కడి నుంచి ప్రత్యేక రైళ్లు కూడా ప్రారంభమవుతాయని అన్నారు. రద్దీ ఉన్న రూట్లలో  సెలెక్ట్ చేసి ఈ ప్రత్యేక రైళ్లను ప్రకటించారని ఆయన వివరించారు. కోవిడ్ నిబంధనల మేరకే రైల్వే ప్రయాణికులు వ్యవహరించాలని అన్నారు. మాస్కు తప్పని సరిగా ధరించాలన్నారు. రైల్వే స్టేషన్ లోపలికి వచ్చే ముందు ధర్మల్ స్క్రీనింగ్ పరీక్ష జరుగుతుంది అని స్పష్టం చేసారు. ఇవి ప్రత్యేక రైలు కాబట్టి చార్జీలు కూడా అదనంగా ఉంటాయని అన్నారు. రైళ్లలో దుప్పట్లు ,క్యాటరింగ్ ఫెసిలిటీ ఉండదని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: