ఆంధ్రప్రదేశ్ లో అక్రమ మద్యం విషయంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఎన్ని విధాలుగా పోలీసులు కట్టడి చేస్తున్నా మార్పు అనేది రావడం లేదు. చిత్తూరు జిల్లాలో మిలిటరీ మద్యం పేరుతో అక్రమంగా నకిలీ మద్యాన్ని అమ్ముతున్న 4 వ్యక్తుల అంతర రాష్ట్ర  ముఠాను అరెస్ట్ చేసిన చిత్తూరు పోలీసులు రిమాండ్ కి తరలించారు. రూ.1,50,000/- విలువ చేసే 210 నకిలీ మిలిటరీ మద్యం బాటిళ్ళు స్వాధీనం చేసుకున్నారు.  

బెంగళూరు-తిరుపతి హై వే రోడ్, పెనుమూరు క్రాస్ కి సమీపంలో అరెస్ట్ చేసారు.  గ్యాంగ్ లాగా ఏర్పడి, అక్రమ మద్యాన్ని తయారు చేసి, దాని పైన మిలిటరీ వాళ్ళకు సప్లై చేసే మద్యం లాగా లేబుల్ లు అంటించి, ప్రజలు నమ్మే విధం గా చేసి విక్రయిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక సహా  తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో  జోరుగా వీరి విక్రయాలు జరుగుతున్నాయి అని పోలీసులు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: