తిరుమల తిరుపతి  దేవస్థానం నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలతో పాటు స్వామి వారి ప్రసాదం కూడా సమర్పించారు టీటీడీ ట్రస్ట్ బోర్డ్ సభ్యుడు, ఎమ్మెల్యే పార్ధసారధి. టీటీడీ సభ్యులకు  ఆలయ ఈవో, వేద పండితులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్థసారథి మీడియాతో మాట్లాడారు. నవరాత్రుల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించామని చెప్పారు.

అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అమ్మవారి దీవెన, వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు తో  ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు. అమ్మవారు, వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి అన్నారు. ఇంకా మెరుగైన పాలన సీఎం జగన్ ప్రజలకు అందించాలి అని కోరుకున్నాము అని చెప్పారు. ఈ కరోనా మహమ్మారిని పారద్రోలి ప్రజలు అందరు సుఖసంతోషాలతో ఉండాలి అని కోరుకున్నామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: