వరకట్న వేధింపులు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఎక్కడో ఒక చోట ఈ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. జగద్గిరి గుట్ట పీఎస్ పరిధిలోని  పాపిరెడ్డి నగర్ లో ఈ ఘటన జరిగింది. కృష్ణ ప్రియ (24) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. అత్తింటి వారే చంపేసారని కృష్ణ ప్రియ తల్లిదండ్రులు ఆరోపించారు.

ఫ్యాన్ కి ఉరి వేసుకొని చనిపోయిందని కృష్ణ ప్రియ భర్త, అత్త, మామ అంటున్నారు. పెళ్లిలో ఐదు లక్షల కట్నం తీసుకుని, మరో 12 లక్షల కట్నం డిమాండ్ చేసాడు కృష్ణ ప్రియ భర్త శ్రవణ్ కుమార్. ఐదు కాసులు బంగారం పెడితేనే శ్రీమంతానికి అమ్మ వాళ్ళు ఇంటికి పంపుతాము అని చెప్పారు అత్తింటి వారు. ఐదు నెలల ప్రెగ్నెంట్ తో ఉన్న కృష్ణ ప్రియ మనో వేదనతో ఆత్మహత్య చేసుకుంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: