గుజరాత్​ కచ్​ జిల్లాలో ఓ విషాద ఘటన వెలుగుచూసింది. భార్యకు విషమిచ్చి అనంతరం తన ముగ్గురు పిల్లలను కత్తితో పొడిచి పరారయ్యాడు ఓ కిరాతక భర్త.కచ్​ జిల్లా జఖనియా గ్రామానికి చెందిన శివాజీ అలియాస్​ జాఖు పాంచన్ సంగార్​... భార్యతో గొడవపడ్డాడు. అనంతరం విచక్షణ కోల్పోయిన సంగార్...​ భార్యకు విషమిచ్చాడు. తర్వాత తన ముగ్గురు పిల్లలను అతి కిరాతకంగా హతమార్చాడు.


 దీంతో భార్య ప్రాణభయంతో కేకలు పెట్టగా... స్థానికులు.. ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధరించారు.ఘటనపై కేసు నమోదు చేసి, నిదింతుడి కోసం గాలిస్తున్నారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: