ఉత్తరాఖండ్​లో అంతర్జాతీయ నిషేధం విధించిన థార్చులా బ్రిడ్జ్​ను పునఃప్రారంభించింది ఆ రాష్ట్రం. పింఛన్​దార్ల సౌకర్యార్థం మూడురోజుల పాటు ఈ సేవలు కల్పిస్తున్నట్టు రాష్ట్ర సర్కార్​ తెలిపింది. ఫలితంగా గతంలో భారత సైన్యం, ఇతర విభాగాలలో పనిచేసిన పింఛన్​దార్లు.. బ్యాంకులు, తపాలా శాఖ ద్వారా తమ పెన్షన్​ సొమ్మును విత్​ డ్రా చేసుకునేందుకు వీలుగా రాకపోకలకు మార్గం సుగమమైంది.


రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్రిడ్జ్​ ద్వారా రాకపోకలకు అనుమతి కల్పించారు అధికారులు. ఈ మేరకు బుధవారం 239 మంది నేపాలీయులు దేశంలోకి వచ్చారు. అలాగే 151 మంది భారతీయులు హిమాలయ దేశానికి వెళ్లారు. అనంతరం.. 2 గంటల తర్వాత బ్రిడ్జ్​ను మూసివేసినట్టు స్థానిక తహసీల్దార్​ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: