కేరళలోని త్రివేండ్రంలో అంత్యక్రియలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేందుకు ఏర్పాటు చేస్తోంది అక్కడి యంత్రాంగం. ప్రజా శ్మశానవాటిక శాంతికవాడం నుంచి ఈ సేవలు కల్పించనుంది. కరోనా నేపథ్యంలో అంతిమ సంస్కారాల్లో పాల్గొనేందుకు.. కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల వల్ల ఈ నిర్ణయం తీసుకుంది.ఈ సేవలకు సంబంధించి ఆన్​లైన్​ స్ట్రీమింగ్​ వ్యవస్థను అభివృద్ధి చేశారు అధికారులు.



 అంత్యక్రియల ప్రత్యక్ష ప్రసారాలను.. డైరెక్టర్​ ఆఫ్​ స్మార్ట్​ త్రివేండ్రం వెబ్​ పేజీ, శాంతికవాడం యూట్యూబ్​ ఛానెల్​, ఫేస్​బుక్​ పేజీల ద్వారా వీక్షించవచ్చు. సంబంధిత దృశ్యాలు, ఖననమయ్యే వ్యక్తి పేరు శాంతికవాడం గేట్​ ముందు ప్రదర్శిస్తారట. అంతేకాకుండా.. దహన ధ్రువీకరణ పత్రం (క్రిమేషన్​ సర్టిఫికెట్​)ను ఆన్​లైన్​లోనూ అందుబాటులో ఉంచుతారట.రాష్ట్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం.. కొవిడ్​ మార్గదర్శకాలను అనుసరించి ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 381 మందికి శాంతికవాడంలో అంత్యక్రియలు జరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: