బెంగళూరు కోరమంగళకు చెందిన ఓ వివాహిత తన భర్త రోహిత్​ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రోజు డ్రగ్స్​ తీసుకుని వరకట్నం పేరుతో వేధిస్తున్నాడని వాపోయింది. అంతేగాక తనను కూడా మాదకద్రవ్యాలు తీసుకోవాలని బలవంతం చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది.ప్రైవేట్​ కంపెనీలో పని చేసే రోహిత్​కు ముందునుంచే డగ్స్​ తీసుకునే అలవాటు ఉన్నా.. తల్లిదండ్రులు వారించలేదని వెల్లడించింది. దీంతో బయట కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చి బలవంతం చేస్తున్నట్లు పోలీసులకు వివరించింది. ఇప్పటికీ ఇంట్లో కొకైన్​ ఉందని తెలిపింది.


తాను డ్రగ్స్​ తీసుకోను అని చెప్తున్నా బలవంతపెడుతూ.. వీడియోలు తీసేవాడని ఫిర్యాదులో పేర్కొంది.మాదకద్రవ్యాలు తీసుకోవాలంటూ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్న భర్తపై ఓ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండేళ్ల కిందట పెళ్లైనా ఇప్పటికీ వరకట్నం పేరుతో వేధిస్తున్నాడని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: