బిహార్​ డిప్యూటీ సీఎం, బిజేపి నేత సుశీల్​కుమార్​ మోదీకి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ప్రస్తుతం మెరుగైన చికిత్సకోసం పట్నా ఎయిమ్స్​లో చేరినట్లు ఆయన తెలిపారు. త్వరలో కోలుకొని తిరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్​లో తెలిపారు సుశీల్​..బిహార్​ బిజేపి లో కీలకనేతగా ఉన్నా మోదీ.. ఇటీవల కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించడం లేదు.


బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసే కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కాలేదు.ఇదిలా ఉంటే రాష్ట్రంలో ప్రధాని పర్యటనకు ముందు రోజు ఈ వార్త తెలియడం వల్ల భాజపా శ్రేణులు గందరగోళంలో పడ్డాయి. ప్రధాని మోదీ పాల్గొనే ర్యాలీల్లో ముఖ్యమంత్రి నితీశ్​కుమార్​తో కలిసి సుశీల్​ పాల్గొంటారని కార్యకర్తలు భావించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: