మహబూబాబాద్ దీక్షిత్ కిడ్నాప్ సహా హత్య వ్యవహారంలో అనేక అనుమానాలు వస్తున్నాయి నిందితుదు మంద సాగర్ కు బాలుడి బాబాయ్ మనోజ్ రెడ్డి కి మధ్య సంబంధాలపై వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. అసలు వీరికి మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా...? నిజంగా డబ్బుల కోసమే చంపారా...? డబ్బుల కోసం చంపేస్తే తీసుకువెళ్ళిన గంటలో ఎందుకు చంపుతారు అనే కోణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

గతంలో పోలీస్ వాహనం నడిపే ప్రయివేటు డ్రైవర్ గా పనిచేసీన మంద సాగర్... ప్రవర్తన కారణంగా ఉద్యోగం కోల్పోయాడు. ఈ రోజు మరోసారి మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు  జిల్లా ఎస్పీ కోఠి రెడ్డి మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది. నిందితుడు  సాగర్  అలాగే బాలుడి తల్లిదండ్రులు ఇద్దరిదీ ఒకే గ్రామం కావడం, పైగా పక్క పక్క  నివాసాలే కావడంతో శనిగాపురం గ్రామంలో పోలీస్ భద్రత పెంచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: