ములుగు జిల్లాలో ఒక కిడ్నాప్ ఘటన సంచలనం అయింది. వెంకటాపురం మండలంలో సీనీఫక్కీలో  నాలుగు నెలల బాబు కిడ్నాప్  అయ్యాడు. అదే తరహాలో కిడ్నాపర్లను ఛేజ్ చేసి స్థానికులు పట్టుకున్నారు. వాహనాన్ని, కిడ్నాపర్లను, బాలుడ్ని పోలీసులకు అప్పగించారు. నాలుగు నెలలక్రితం బాలుడిని నాగేశ్వరీ అనే మహిళ దత్తత తీసుకుంది. దత్తత ఇచ్చినవారే ఈ పని చేసి ఉంటారని పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది.  

ప్రేమ పెళ్లి చేసుకుని ఇంట్లో వారు కాదనడంతో 7 నెలల గర్భిణిగా నాగేశ్వరిని ఆశ్రయించారు స్నేహ-మహేందర్ దంపతులు. అప్పుడు ఆమె కాన్పు చేసింది. బాలుడిని తల్లిదండ్రులు వద్దనడంతో దత్తత నాగేశ్వరి తీసుకున్నారు. అర్థరాత్రి నాగేశ్వరిపై దాడి చేసి, కళ్లలో కారం చల్లి బాలుడిని  తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేసారు. అప్రమత్తం అయిన స్థానికులు చాలా జాగ్రత్తగా వారి చేర నుంచి బాలుడుని విడిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: