మహబూబాబాద్ జిల్లాలో దీక్షిత్ కిడ్నాప్ వ్యవహారం సంచలనంగా మారింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే బాలుడుని కిడ్నాప్ చేసిన తర్వాత విడిచిపెట్టకుండా హత్య చేసారు. దీనితో తల్లి తండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇక బాలుడి తల్లి వసంత మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేసారు. నిందితులను ఎన్ కౌంటర్ చేయాలి అని దీక్షిత్ తల్లి వసంత  డిమాండ్ చేసారు.

ఏ కన్న తల్లికి ఇంత శోకం రాకూడదు అని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. ఎన్ కౌంటర్ చేయకుంటే ఏ తల్లి ధైర్యంగా పిల్లలను బయటకు పంపే పరిస్థితి ఉండదు అని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. చిన్న పిల్లవాడు అని చూడకుండా కిరతంగా చంపినవాళ్ల తగిన శిక్ష విధించాలి  అని ఆమె విజ్ఞప్తి చేసారు. నింధితులను ఎన్ కౌంటర్ చేస్తేనే నా కొడుకు ఆత్మ శాంతిస్తుంది అని వసంత అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: