తెలంగాణాలో సిఎం కేసీఆర్ ని టార్గెట్ గా చేసుకుని విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. రాష్ట్రంలో బలపడే క్రమంలో ఉన్న బిజెపి, కాంగ్రెస్ సిఎం ని టార్గెట్ గా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా మరోసారి కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేసారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ... ప్రధాని మోదీ, కేసీఆర్ లవి తప్పుడు ఆలోచనలు అన్నారు.

వ్యాపారులకు లాభం చేకూర్చడమే కేసీఆర్ లక్ష్యం అని ఆరోపించారు. రైస్ మిల్లర్ల తో కేసీఆర్ కుమ్మక్కు అయ్యారు అని అన్నారు. రైతులను కేసీఆర్ నట్టేటా ముంచారు అని ఆయన మండిపడ్డారు. కడుపు కాలి రైతులు రోడ్డెక్కుతున్నారు అని అన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కంటే రాజుల కాలం నయం అని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: