విజయవాడ వాసులు ఎంతగానో ఎదురు చూసిన కనకదుర్గ ఫ్లై ఓవర్ ని  ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనితో ట్రాఫిక్ కష్టాలు కాస్త తీరినట్టుగానే కనపడుతున్నాయి అనే చెప్పాలి. అయితే ఈ కనకదుర్గ ఫ్లై ఓవర్ ఇప్పుడు  ప్రమాదాలకు వేదికగా మారుతుంది కొందరి తప్పులతో. తాజాగా  ఇప్పుడు ఒక ప్రమాదం జరిగింది. ప్రమాదానికి అతి వేగమే కారణం అని తెలుస్తుంది. బైక్ రేసింగ్,  స్టంట్స్ కు కేరాఫ్  గా కనక దుర్గ ఫ్లై ఓవర్  మారింది అని స్థానికులు ఆరోపిస్తున్నారు.

సోషల్ మీడియాలో రేసింగ్ వీడియోలు అప్లోడ్ చేయాలనే అత్యాసతో  బైక్ పై ట్రిపుల్ రైడింగ్ తో  దూసుకుపోతు మరో బైక్ ను ఢీ కొట్టాడు ఒక వాహనదారుడు. మరో బైక్  పై వెళ్తున్న  వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: