గత కొన్ని సంవత్సరాలుగా, దేశంలో నక్సల్స్ కార్యకలాపాలను పరిమితం చేయడానికి చాలా ప్రయత్నాలు... అలాగే కఠినమైన చర్యలు తీసుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బీహార్‌ లోని గయాలోని గాంధీ మైదానంలో బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. నక్సల్ ఉనికిని ఇప్పుడు కొన్ని ప్రాంతాలకు పరిమితం చేసామని అన్నారు. అదే విధంగా... మరికొన్ని వ్యాఖ్యలు చేసారు.

“నేను గుజరాత్ సిఎంగా అలాగే నితీష్ జి బీహార్ సిఎంగా ఉన్నప్పుడు... యుపిఏ ప్రభుత్వంలోని కేంద్ర  ప్రభుత్వ సమావేశాలకు హాజరైనప్పుడు నితీష్ జీ అనే వారు... బీహార్ అభివృద్ధిని నిలిపివేయవద్దు అని కోరేవారు. కానీ 10 సంవత్సరాలు, బీహార్ లో ఓడిపోయిన వారు కోపంగా ఉన్నారని... వారు కేంద్రాన్ని ప్రభావితం చేశారు... ఆ సమయంలో నితీష్ జీ అభివృద్ధి చేయలేకపోయా అని తెలుసుకున్నారు. వారు బీహార్ కి పదేళ్ళ అభివృద్దిని దూరం చేసారని”  మోడీ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: