బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ దూసుకుపోతున్నారు. ఆర్జెడి మహాకూటమి టార్గెట్ గా ఆయన విమర్శలు చేస్తున్నారు. బీహార్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో ప్రధాని మోడీ సహా ఇతర బిజెపి అగ్ర నేతలు అందరూ కూడా ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేసారు.

బీహార్ లో నక్సలిజానికి ఫ్రీ రన్ ఇచ్చారు అని ఆయన ఆరోపణలు చేసారు. బీహార్ లో ఇప్పుడు నక్సల్స్ లేరు అని అన్నారు. అంతే కాదు బీహార్ లో కరెంట్ ఉంది అని లాంతరు అవసరం లేదని ఆర్జెడి  ఎన్నికల గుర్తు  టార్గెట్ చేస్తూ ఆయన విమర్శలు చేసారు. బీహార్ లో ఆత్మ నిర్భర భారత్ ముందుకు వెళ్ళాలి అంటే కచ్చితంగా ఎన్డియే గెలవాలని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: