ప్రకాశం జిల్లాలో కరోనా తగ్గడం పెరగడం జరుగుతుంది. ఇక జిల్లాలో రెండు జడ్పీ హైస్కూల్స్ లో చదువుతున్న విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ముండ్లమూరు మండలం మారెళ్ల జడ్పీ హైస్కూల్ లో ఎనిమిది మంది విద్యార్థులకు కరోనా సోకింది. కొత్తపట్నం మండలం గమళ్లపాలెం జడ్పీ హైస్కూల్ లో ఇద్దరు విద్యార్థులతో పాటు ఓ ఉపాధ్యాయునికి కరోనా పాజిటివ్ వచ్చింది.

హోం క్వారంటైన్ లో చికిత్స చేస్తున్నారు. విషయం తెలిసి స్కూళ్లకు విద్యార్థులను పంపించడం లేదు. స్కూళ్లలో కనీస ప్రమాణాలు పాటించటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖాధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవటం లేదని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే తరగతులు నిర్వహిస్తున్నామని స్కూల్ లో చెప్తున్నారు. ప్రస్తుతం విద్యార్ధులు ఎవరికి ఇబ్బంది లేదని అధికారులు అంటున్నారు. జాగ్రత్తగా చర్యలు చేపడుతున్నామని చెప్తున్నారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: