మాజీ ఎంపీ హర్ష కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. రోడ్ల పరిస్థితిపై ఆయన మాట్లాడారు. నేను పుట్టిన తర్వాత ఇంత అసహ్యంగా రోడ్లు ఎప్పుడూ లేవు అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్  జగన్ కు ఛాలెంజ్ చేస్తున్నా అని... గోదావరి నాలుగో వంతెన పై కొవ్వూరు నుంచి రాజమండ్రి వరకు ముఖ్యమంత్రి కాన్వాయ్ ప్రయాణిస్తే జగన్ ఏమి చెప్పినా నేను చేస్తాను అని ఆయన సవాల్ చేసారు.

రాజకీయాలు నుంచి తప్పుకోమంటే తప్పుకుంటాను అని ఆయన సవాల్ విసిరారు. జాతీయ రహదారులు మరమ్మతులు చేసిన తర్వాతే టోల్ వసూలు చేయాలి అని ఆయన అన్నారు. రోడ్లు మరమ్మతులు చేయకుండా వాహనాలు పై జరిమానా విధించడం ముఖ్యమంత్రి కి సబబు కాదు అని ఆయన హెచ్చరించారు. నేడు మీడియాతో మాట్లాడుతూ హర్ష కుమార్ ఈ వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: