ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాపిస్తోంది అని చిన జీయర్ స్వామి అన్నారు. కరోనా మహమ్మారి బారిన పడి  ప్రజలు కష్టాలు పడుతున్నారు అని ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్  నివారణ వ్యాక్సిన్ కోసం భారత్ సహా ప్రపంచ దేశాల్లో తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. భారత్ లోనూ వ్యాక్సిన్ పై  రెండో దశ పరీక్షలు జరుగుతున్నాయి అని చెప్పారు.

వ్యాక్సిన్ కోసం చేస్తోన్న ప్రయత్నాలు సఫలం కావాలని అమ్మవారిని ప్రార్థించా  అన్నారు . వ్యాక్సిన్ వస్తే ప్రజల్లో వ్యాధినిరోధక శక్తి పెరిగి తిరిగి శక్తిమంతులవుతారు అని అన్నారు. అదే విధంగా భారత్ తిరిగి శక్తివంతమైన దేశంగా వెలుగొందాలని కోరుకున్నా అని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ చాలా ముఖ్యమైంది అని ఆయన అన్నారు. ప్రకృతిని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: