కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది... ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయ్... ఈ వైరస్ ఎవరిని అసలు వదలడం లేదు. పేద, మధ్యతరగతి, ధనిక అనే తేడా కూడా  లేకుండా అందరికీ సోకుతోంది....సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ఈ కరోనా ఎవరినీ వదలడం లేదు.... అయితే తెలంగాణా హైదరాబాద్ నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబెడ్కర్ నగర్ కు చెందిన వెంకటేష్ అనే వ్యక్తి కరోనా వ్యాధితో మరణించాడు. భర్త మరణం తట్టుకోలేని భార్య ధనలక్ష్మి  గృహిణి తాము నివసిస్తున్న బిల్డింగ్ పైనుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న నేరేడ్మెట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు....


ఒకసారిగా ఈ విషయం వైరల్ గ మారింది...ప్రేమంటే ఇదే అన్న మాదిరి ఒకరిని విడిచిపెట్టి మరొకరు ఉంది కూడా లాభం లేదాన్ని ఆ భార్య ఆత్మహత్య చేసుకోవడం నిజంగా బాధాకరమే...ఇక ఇది ఇలా ఉండగానే,,కరోనా మహమ్మారి  సామాన్యుడినుంచి సెలబ్రెటీలు వరకు కూడా అందరిని వణికిస్తోంది నేడు.....  సినిమా రంగంలోను పలువురు కరోనా బారిన పడినవిషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ జంట రాజశేఖర్, జీవిత ఈ నెల 17 న కరోనా బారిన పడ్డారు.  వారం రోజుల క్రితమే కరోనా సోకినప్పటికీ ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే..జీవిత హోమ్ ఐసొలేషన్ లో ఉండగా రాజశేఖర్ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. నిన్న రాత్రి నుంచి రాజశేఖర్ కు శ్వాస సంబంధమైన ఇబ్బందులు తలెత్తుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాజశేఖర్ కూతురు శివాత్మిక ట్వీట్ వైరల్ అయింది.   కరోనా తో పోరాటం చేయడంలో నాన్న ఇబ్బందులు పడుతున్నారని, అందరి అభిమానంతో నాన్న క్షేమంగా తిరిగివస్తారని ఆశిస్తున్నట్లు ఆమె తన ట్విట్టర్ లో కోరారు. ఆమె ట్వీట్ తో రాజశేఖర్ సన్నిహితులు కూడా ప్రార్థనలు చేస్తున్నారు......

మరింత సమాచారం తెలుసుకోండి: