ఖాతాదారుల వ్యక్తిగత డేటా భద్రత, గోప్యతపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ సంస్థలకు సమన్లు జారీ చేసింది. వ్యక్తిగత డేటా భద్రత బిల్లు-2019కు సంబంధించి జారీ చేసిన సమ‌న్లపై ఫేస్‌బుక్‌ ఇండియా ప్రతినిధులు శుక్రవారం హాజరుకావాలని.. కమిటీ ఆదేశించింది.


ప్యానెల్‌ ముందు అక్టోబర్‌ 28లోపు ట్విట్టర్‌ అధికారులు హాజరు కావాలని లోక్‌సభ సచివాలయం జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. ఇదే అంశంపై అమెజాన్‌, గూగుల్‌ సంస్థల ప్రతినిథులను పిలిపించే అంశాన్ని... సంయుక్త పార్లమెంట్‌ కమిటీ పరిశీలిస్తోందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అవసరమైతే ఎవరినైనా పిలుస్తామని, సామాజిక మాధ్యమాల్లో డేటా భద్రత,గోప్యత అంశాలపై పార్లమెంటరీ కమిటీ సమగ్రంగా అధ్యయనం చేస్తుందని కమిటీ ఛైర్మన్‌ మీనాక్షి లేఖి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: