రాష్ట్రీయ జనతా దళ్​(ఆర్​జేడీ) అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​ నవంబర్​ 9న బెయిల్​పై విడుదలవుతున్నారని తెలిపారు ఆయన కుమారుడు, మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్​. ఆ మరుసటి రోజునే బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ వీడ్కోలు అందుకుంటారని పేర్కొన్నారు. నవంబర్ 10న బిహార్ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడడాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.బిహార్​ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హిసువాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు తేజస్వీ​. ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.


కరోనా వైరస్​ భయంతో 144 రోజుల పాటు సీఎం కార్యాలయం నుంచి బయటకు రాని ముఖ్యమంత్రి.. ఇప్పుడు ఓట్ల కోసం వచ్చారని ఆరోపించారు తేజస్వీ. మహాకూటమి అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీకి.. నిధులు ఎక్కడి నుంచి తెస్తారన్న ఎన్​డీఏ ప్రశ్నకు సమధానమిచ్చారు ఆర్​జేడీ నేత. బిహార్​ బడ్జెట్​ రూ.2.13 లక్షల కోట్లు అయితే.. నితీశ్​ ప్రభుత్వం కేవలం 60 శాతం ఖర్చు చేసిందని.. ఇంకా రూ.80,000 కోట్లు మిగిలి ఉంటాయన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: