పార్లమెంట్​ ప్రాంగణంలో సరికొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తమ లంచ్​ బాక్స్​లను, ఇతర పాత్రలను కడగరాదని లోక్​సభ సచివాలయం స్పష్టంచేసింది. ఈ మేరకు ఓ సర్కులర్​ జారీ చేసింది.రాజ్యసభ ప్రాంగణంలోనూ ఈ నిబంధనలు వర్తిస్తాయని లోక్​సభ సాధారణ కార్యకలాపాల శాఖ స్పష్టం చేసింది. అయితే, దీనిపై పార్లమెంట్​లో​ ఏళ్ల తరబడి పని చేస్తున్న సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమను ఇంతకుముందెవరూ ఇలా అడ్డుకోలేదని అంటున్నారు.

 కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో భాగంగానే.. ఈ తరహా నిబంధనలను తీసుకువచ్చామని పార్లమెంట్​లోని ఉన్నతాధికారులు చెబుతున్నారు.పార్లమెంట్​ భవన సముదాయంలో.. పాత్రలను, లంచ్​ బాక్స్​లను కడుగుతున్నందున డ్రైనేజీకి ఆటంకం ఎదురవుతోంది. ఇది పారిశుద్ధ్య సమస్యలను తెచ్చిపెడుతోంది. దుర్గంధం వ్యాపిస్తోంది. దయచేసి వాష్​రూమ్​లలో ఎవరూ పాత్రలు కడగవద్దు. పరిశుభ్రతను పాటించడంలో అందరూ సహకరించండి అని లోక్​సభ సచివాలయం కోరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: