చారిత్రక అయోధ్య నగరంలో ప్రదర్శితమవుతోన్న 'రామ్​లీలా' నాటక వీక్షకుల సంఖ్య పదికోట్ల మార్క్​ను దాటింది. టీవీ, యూట్యూబ్​, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం కల్పించడం వల్లే ఇన్ని వ్యూస్​ వచ్చినట్టు నిర్వాహకులు తెలిపారు. ఉర్దూ సహా మొత్తం 14 భాషల్లో ప్రత్యక్ష ప్రసారమవుతోన్న ఈ నాటకం.. ఉత్తర్​ప్రదేశ్​లోని సరయూ నదీ ఒడ్డున లక్ష్మణ ఖిలాలో ఈ నెల 17న ప్రారంభమైంది.ఏటా దసరా పండుగ సందర్భంగా భక్తులను ఆకట్టుకునే ఈ నాటక ప్రదర్శనను కరోనా కారణంగా ఈ ఏడాది వర్చువల్​గా నిర్వహిస్తున్నారు అధికారులు.


 అయితే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే ఈ నాటకాన్ని దూరదర్శన్, టీవీ ఛానెళ్లు, యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా వీక్షించే ఏర్పాటు చేశారు.ఈశాన్య ఢిల్లీకి చెందిన బిజేపి ఎంపీ మనోజ్ తివారీ- అంగధుడు, గోరఖ్పుర్ ఎంపీ, భోజ్పుర్ నటుడు రవికిషన్- భరతుడు, విందూ దారాసింగ్- హనుమంతుడి పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్‌ దిగ్గజ హాస్యనటుడు అస్రానీ- నారద మునిగా, షాబాజ్ఖాన్- రావణుడిగా కనిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: