కరోనా వ్యాక్సిన్​ను ప్రజలకు ఉచితంగా అందిస్తామని బిహార్​ ఎన్నికల మేనిఫెస్టోలో బిజేపి హామీ ఇవ్వడాన్ని వివిధ రాజకీయ పార్టీలు తప్పుబడుతున్నాయి. అయితే ఈ విషయంపై ఎన్నికల సంఘం మాజీ అధికారులు స్పందించారు. బిజేపి హామీ చట్టబద్ధంగా తప్పుకాదన్నారు.అయితే బిజెపి ఎన్నికల హామీ నైతికత ప్రశ్నను లెవనెత్తుతోందన్నారు ఎస్​వై ఖురేషీ. ఎన్నికల ప్రవర్తన నియమావళి పూర్తిగా నైతిక విలువలకు సంబంధించిందని చెప్పారు. 2010 నుంచి 2012 మధ్య కాలంలో పోల్​ ప్యానెల్ చీఫ్​గా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు.


రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఎలాంటి హామీలైనా ఇవ్వొచ్చని మరో మాజీ అధికారి ఓపీ రావత్​ అన్నారు. అయితే ఆ హామీని నెరవేర్చడానికి ఎంత బడ్జెట్​ అవుతుందనే విషయాన్ని కూడా ఆయా పార్టీలు మేనిఫెస్టోలో పొందుపర్చాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 2018, డిసెంబర్​లో​ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి బాధ్యతలకు వీడ్కోలు పలికారు రావత్.

మరింత సమాచారం తెలుసుకోండి: