దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్ర కీలాద్రి పై అమ్మవారిని దర్శించుకున్న మాజీ హోం మంత్రి, తెదేపా నేత నిమ్మకాయల చిన రాజప్ప రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. గుడి వద్ద చేసిన ఏర్పాట్లను ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడారు. కోవిడ్ కు తగ్గట్లుగా దుర్గ గుడి వద్ద ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది అని ఆయన అభినందిచారు. పరిమిత సంఖ్యలో భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు అని ఆయన అన్నారు.

పలు ప్రాంతాల నుంచి భవానీలు అమ్మవారి దర్శనం  కోసం తరలివస్తున్నారు అని పేర్కొన్నారు. భవానీలకు తగిన ఏర్పాట్లు కల్పించాల్సిన బాధ్యత దేవస్థానంపై ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా త్వరగా పోవాలి, ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నా అని ఆయన తెలిపారు. కాగా దసరా ఉత్సవాలు రేపటి తో ముగుస్తాయి. నేడు 8వ రోజు.

మరింత సమాచారం తెలుసుకోండి: