కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి నేడు, రేపు  ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో ఆయన చర్చలు జరుపుతున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, స్థానిక నేతలు ఆయనకు స్వాగతం పలుకుతారు. రేపు ఉదయం నూతన రాష్ట్ర పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో  సోము వీర్రాజు  ఇతర జాతీయ రాష్ట్ర నేతలతో కలసి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొంటారు అని ఏపీ బిజెపి నేతలు పేర్కొన్నారు.

దుర్గమ్మ గుడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు. ఈ రోజు సాయంత్రం ఆయన విజయవాడ చేరుకునే అవకాశం ఉంది. దీనితో ఆయనకు ఘన స్వాగతం పలకడానికి బిజెపి నేతలు సిద్దమవుతున్నారు. ఇక ఆయన భద్రత నేపధ్యంలో భద్రత కూడా పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నారు. రేపటి తో దసరా ఉత్సవాలు ముగుస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: