ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నేతలకు సంబంధించిన ఆస్తుల విషయంలో ఏపీ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విశాఖకు చెందిన సబ్బం హరి విషయంలో  వైసీపీ ప్రభుత్వం కాస్త కఠినంగా వ్యవహరించింది. ఇప్పుడు గీతం యునివర్సిటి ని టార్గెట్ చేస్తుంది అనే ఆరోపణలు వస్తున్నాయి.

గీతం యూనివర్సిటీ ఎదుట భారీ స్థాయిలో స్థానిక పోలీసులు, జివిఎంసి, అధికారులు మొహరించారు. గీతం యూనివర్సిటీ ప్రహరీ గోడ కూల్చివేత ప్రారంభం అయింది. దానితో పాటుగా మరి కొన్ని నిర్మాణాలు తొలగించే అవకాశ౦ ఉందని అధికారులు అంటున్నారు. దీనిపై గీతం యునివర్సిటీ యాజమాన్యం స్పందించింది. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, నిర్మాణాలు తొలగిస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే వరుసగా టిడిపి నాయకుల టార్గెట్ గా నిర్మాణాలు  కూలుస్తున్నారు అని టిడిపి  మండిపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: