తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాదం జరిగింది. ఆలయంలోని పోటు లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రసాదాలు తయారు చేసే వకుళామాత పోటు లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోటులో బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో అయిదుగురు కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. పులిహోర ప్రసాదం కోసం చింతపండు వేడి చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

 గాయపడిన వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో 40 మంది కార్మికులు ఉన్నారు. ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. మంటలు ఏమీ చెలరేగలేదు అని అధికారులు పేర్కొన్నారు. గాయపడిన వారిని తిరుపతిలోని అశ్విని ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: