పోలవరం ప్రాజెక్ట్ పై ఏపీ సిఎం వైఎస్ జగన్ అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. కాసేపటి క్రితం ఈ సమీక్షా సమావేశం మొదలయింది. ఈ సమావేశానికి ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, జలవనరుల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రావత్, ఇతర అధికారులు హాజరు అయ్యారు.  

పోలవరం అంశంలో కేంద్ర ప్రతిపాదనలపై చర్చ జరగనుంది. చంద్రబాబు హయం లో  కేంద్రం 55 వేల కోట్లకు కేంద్రం అంగీకరించడం ఇప్పుడు మాట మార్చడంపై చర్చ జరుగుతుంది. జాతీయ ప్రాజెక్టు హోదా ఉన్న పోలవరం అంచనా వ్యయాన్ని... 2013-14లో తెలిపినట్లుగా 20,398.61 కోట్లకే పరిమితం చేయడం పై చర్చ జరుగుతుంది. 2013లో వచ్చిన కొత్త భూసేకరణ, పునరావాస చట్టం ప్రకారం పరిహారం ఖర్చు భారీగా పెరగడంతో... ప్రాజెక్టు తుది అంచనా వ్యయం 55,548.87 కోట్లుగా అంచనా వేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: