పంజాబ్‌ లీగ్‌ రెండో అర్ధభాగంలో బాగా ఆడుతోంది. వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. దుబాయ్​ వేదికగా జరిగిన మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​పై 12​ పరుగులు తేడాతో గెలుపొందింది. 127 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్‌ను 114కే కుప్పకూల్చింది. ఈ విజయంతో ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది పంజాబ్​.రెండో ఇన్నింగ్స్​ ప్రారంభించిన సన్​రైజర్స్​లో డేవిడ్‌ వార్నర్‌ (35; 20 బంతుల్లో 3×4, 2×6), విజయ్‌ శంకర్‌ (25; 25 బంతుల్లో 4×4) క్రీజులో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించారు. మిగతా వాళ్లు విఫలమయ్యారు. 


పంబాబ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ (3), అర్ష్దీప్ సింగ్ (3), షమీ, అశ్విన్, రవి బిష్టోయ్ తలో వికెట్ తీశారు.అంతకు ముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్‌లో నికోలస్‌ పూరన్‌ (32; 28 బంతుల్లో 2×4) టాప్ స్కోరర్. కేఎల్‌ రాహుల్‌ (27; 27 బంతుల్లో 2×4, 1×6), క్రిస్‌ గేల్‌ (20; 20 బంతుల్లో 2×4, 1×6) నామమాత్రంగా ఆడారు. సన్రైజర్స్ బౌలర్లలో సందీప్ శర్మ, రషీద్, హోల్డర్ తలో రెండు వికెట్లు తీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: