మహారాష్ట్ర ముంబయి మహానగరంలోని సిటీ సెంటర్​ మాల్​ అగ్ని ప్రమాదంలో మంటలు అదుపు చేసే చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం రాత్రి 8.53 గంటల ప్రాంతంలో భవనం రెండో అంతస్తులో మంటలు చెలరేగగా.. 36 గంటలుగా మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. 18 అగ్నిమాపక యంత్రాలు, 10 జంబో ట్యాంకుల సాయంతో ఆపరేషన్​ కొనసాగిస్తున్నట్లు చెప్పారు అధికారులు.


అగ్ని ప్రమాదం జరిగిన తొలుత.. లెవల్​-1గా ప్రకటించినప్పుటికీ.. మంటలు వేగంగా విస్తరించటం వల్ల రాత్రి 10.45 గంటలకు లెవల్​-3గా, ఆ తర్వాత మరుసటి రోజు తెల్లవారు జామున 2.30 గంటలకు లెవల్​ 4 ప్రమాదంగా గుర్తించారు. ప్రస్తుతం దీనిని లెవల్​ 5 ప్రమాదంగా పేర్కొన్నారు అధికారులు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పక్క భవనాల్లోని 3,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: