అయోధ్యలో నగరంలో ఏటా అత్యంత వైభవంగా నిర్వహించే దీపోత్సవం.. ఈ ఏడాది సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పనుంది. అందుకోసం మట్టి ప్రమిదలతో 5.5 లక్షల దీపాలు వెలిగించేందుకు ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. కరోనా మహమ్మారి కారణంగా ఎలాంటి ఆటంకం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రేక్షకులను ఈసారి దీపోత్సవాలకు అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయించిన క్రమంలో.. వర్చువల్​గా పాల్గొనేందుకు ఏర్పాట్లు చేపట్టారు.


అధికారిక సమాచారం ప్రకారం.. ఈ ఏడాది అయోధ్య దీపోత్సవం నవంబర్​ 11-13 మధ్య జరగనుంది. 13న ప్రధాన దీపోత్సవం ఉంటుంది.2017లో ఈ దీపోత్సవాన్ని ప్రారంభించింది ముఖ్యమంత్రి యోగి ప్రభుత్వం. రాష్ట్ర పండుగగా ప్రకటించింది. స్థానికులు, వలంటీర్లు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అయోధ్య నగరమంతా.. దీపాలు వెలిగిస్తారు. గత ఏడాది రికార్డు స్థాయిలో 5 లక్షల దీపాలు వెలిగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: