బిహార్​ పట్నా జిల్లాలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. బిహ్తా నగరంలోని సాదిసోపుర్​ రైల్వే స్టేషన్​ సమీపంలో ఓ రైలు రెండుగా విడిపోయింది. కామాఖ్య నుంచి లోక్​మాన్య తిలక్​ వైపు వెళుతున్న క్రమంలో ఏడు బోగీలు ఇంజిన్​ నుంచి వేరు కాగా... ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కేకలు వేశారు. అప్రమత్తమైన డ్రైవర్​.. వెంటనే రైలును నిలిపేశాడు.రైలు ఆగాక చూస్తే... సగం బోగీలు ఇంజిన్​కు కిలోమీటర్​ దూరంలో నిలిచి ఉన్నాయి.


సమాచారం అందుకున్న ధనాపుర్​ రైల్వే డివిజన్​ ఉన్నతాధికారులు, ఇంజినీర్లు సంఘటనా స్థలానికి చేరుకుని.. బోగీలను కలిపారు. రెండు గంటల తర్వాత సేవలను పునరుద్ధరించారు. బోగీలు విడిపోయిన వెంటనే రైలును నిలిపివేయటం, వేగం తక్కువగా ఉండటం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: