మహారాష్ట్ర బిజేపి నేత దేవేంద్ర ఫడణవీస్​కు కొవిడ్​ సోకింది. ఇటీవల తనను కలిసిన నేతలు, కార్యకర్తలు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన ట్విట్టర్​ ద్వారా సూచించారు. మహమ్మారి విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని కోరారు.లాక్​డౌన్​ నుంచి అవిశ్రాంతంగా పని చేస్తున్నాను. దేవుడు నాకు కొంచెం విశ్రాంతి ఇవ్వాలి అని భావించినట్లున్నాడు. కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది.


 స్వీయ నిర్భందంలో ఉన్నాను. వైద్యుల సూచనలను పాటిస్తూ చికిత్సకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటున్నాను అని దేవేంద్ర ఫడణవీస్ అన్నారు.దేశంలో కరోనా కేసుల సంఖ్య 78లక్షలు దాటింది. తాజాగా 53,370మంది కరోనా బారినపడ్డారు. మరో 650మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఒక్కరోజే 67,549మంది కొవిడ్​ను జయించారు. దీంతో రికవరీ రేటు 89.78శాతానికి చేరింది.


మరింత సమాచారం తెలుసుకోండి: