ప్రజలకు సిఎం వైఎస్ జగన్ విజయదశమి శుభాకాంక్షలు చెప్పారు.  ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేసారు. “చెడుపై మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి ప్రతీక దసరా పండుగ. చెడు ఎంత దుర్మార్గమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందన్న సందేశాన్ని ఈ పండుగ తెలియజేస్తుంది. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ శుభాలు కలగాలని, అన్నింటా విజయాలు సిద్ధించాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు” అని జగన్ ట్వీట్ చేసారు.

ఇక వైసీపీ ఎంపీ వీ విజయసాయి రెడ్డి కూడా ట్విట్టర్ లో శుభాకాంక్షలు చెప్పారు. “తెలుగు ప్రజలందరికీ విజయ దశమి పర్వదిన శుభాకాంక్షలు. దుర్గమ్మ ఆశీస్సులతో  మీకు అన్నింటా విజయం కలగాలని మనఃస్ఫూర్తిగా  కోరుకుంటున్నాను.” అని ఆయన తన ట్విట్టర్ లో ట్వీట్ చేసారు. దుర్గమ్మ ఫోటో తో విజయసాయి ట్వీట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: