తమ పార్టీ అధికారంలోకి వస్తే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బార్లు వెనుక ఉంటారని లోక్ జనశక్తి పార్టీ (ఎల్జెపి) చీఫ్ చిరాగ్ పాస్వాన్ ఆదివారం ఎద్దేవా చేసారు. బక్సార్ డుమ్రాన్ లో ర్యాలీలో ప్రసంగిస్తూ పాస్వాన్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ర్యాలీలో, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ముందు పస్వాన్ అనేక ప్రశ్నలు లేవనెత్తారు. రాష్ట్రంలో అక్రమ మద్యం అమ్మకంపై నితీష్ ప్రభుత్వ టార్గెట్ గా ఆయన విమర్శలు చేసారు.

బీహారి నెంబర్ 1 బీహారి ఫస్ట్ ని అమలు చేయడానికి ఎల్జెపి అభ్యర్థులకు ఓటు వేయమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. మిగతా అన్నిచోట్లా బిజెపికి ఓటు వేయండి. రాబోయే ప్రభుత్వం  నితీష్ రహిత ప్రభుత్వం అవుతుంది" అని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్‌డిఎ మాజీ మిత్రపక్షమైన ఎల్‌జెపి అధ్యక్షుడు పాస్వాన్... ఈ ఎన్నికల్లో కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: