ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న అయోధ్యలో రామ మందిర నిర్మాణం విషయంలో ఇప్పుడు ఎల్జెపి అధినేత చిరాగ్ పాశ్వాన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. రామ మందిరం కంటే పెద్దగా సీతాదేవి మందిరాన్ని నిర్మిస్తామని ఆయన ప్రకటన చేసారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. బీహార్ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే  అయోధ్యలో రామ మందిరానికి  మించిన సీతామాత భవ్య మందిరాన్ని నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు.

మేనిఫెస్టో లో అయోధ్యలో రామాలయం తరహాలో.. సీతామర్హిలో సీతామందిరం నిర్మిస్తామని ఆయన ప్రకటన చేసారు. ప్రస్తుత సీఎం తిరిగి ముఖ్యమంత్రి కాకుంటే బీజేపీ నాయకత్వంలో మేము బీజేపీ-ఎల్‌జేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అని అయన స్పష్టం చేసారు. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే బీహార్ లోని సీతామర్హి లో సీతాదేవి మందిరం నిర్మించి అక్కడి నుంచి అయోధ్యను కలిపే ఆరు లేన్ల రోడ్ కారిడార్  నిర్మిస్తామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: