టీడీపీ అధినేత, మాజీ సిఎం చంద్రబాబు టార్గెట్ గా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చేసే ఆరోపణలు అన్నీ ఇన్నీ కాదు. చంద్రబాబుని దాదాపుగా అన్ని కోణాల్లో ఆయన టార్గెట్ గా చేసి విమర్శలు చేస్తూ ఉంటారు. రాజకీయంగా చంద్రబాబు ఇబ్బంది పడుతున్న సమయంలో కూడా ఆయనను ఏదోక రూపంలో విజయసాయి టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ ఉంటారు.

తాజాగా చంద్రబాబు టార్గెట్ గా ఆయన మరోసారి తన ట్విట్టర్ లో కీలక వ్యాఖ్యలు చేసారు. “28 ఏళ్ల క్రితం ఈనిన ఒక గేదె, చంద్రబాబుకు వందల కోట్ల రూపాయల పాలిచ్చింది. 2014లో ఆ గేదెకు గడ్డి పెట్టేందుకు కొన్న బినామీ భూముల్లో వేల కోట్లుగా నోట్ల కట్టలు పండకపోతే మరి చంద్రబాబుకు కోపం రాదా? !” అంటూ ఆయన తన ట్విట్టర్ లో కామెంట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: