దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్​లో చెన్నై 8 వికెట్ల తేడాతో గెలిచింది. బెంగళూరు నిర్దేశించిన 146 పరుగుల లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలుండగానే పూర్తి చేసింది. రుతురాజ్ గైక్వాడ్(65 నాటౌట్) బ్యాటింగ్​తో మెప్పించాడు.146 పరుగుల ఛేదనను ధాటిగా ప్రారంభించింది చెన్నై. ఓపెనర్లు రుతురాజ్, డుప్లెసిస్ ధనాధన్ బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలోనే 5.1 ఓవర్లలో తొలి వికెట్​కు 46 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం 25 పరుగులు చేసిన డుప్లెసిస్ ఔటయ్యాడు.


ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాయుడు(39)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించిన రుతురాజ్.. కెప్టెన్ ధోనీ(19)తో కలిసి లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ క్రమంలో అర్థశతకం చేసి 65 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు. బెంగళూరు బౌలర్లలో మోరిస్, చాహల్ తలో వికెట్ తీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: