బిహార్​ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి సుశీల్​ కుమార్​ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్​జేడీ(రాష్ట్రీయ జనతాదళ్​) అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​.. తనను హత్య చేసేందుకు మూడేళ్ల క్రితం క్షుద్రపూజలు నిర్వహించారని ఆరోపించారు. క్షుద్రపూజల మీద లాలూకు చాలా నమ్మకం ఉందని  అన్నారు.ప్రజలపై లాలూకు నమ్మకం లేదని.. అందుకే క్షుద్ర పూజలు, జంతు బలి, ఆత్మలకు ప్రార్థనలు చేసేవారని పేర్కొన్నారు సుశీల్​. అయినప్పటికీ.. ఇంతవరకు జైలు బయటకు రాలేకపోయారని ఎద్దేవా చేశారు.


2005లో ఓటమి అనంతరం ముఖ్యమంత్రి నివాసాన్ని వీడేందుకు లాలూ నెలన్నర సమయం తీసుకున్నారని గుర్తుచేశారు ఉపముఖ్యమంత్రి. అయితే ఆ ఇంట్లో తాను చేతబడికి సంబంధించిన వస్తువులను దాచినట్టు.. ఇక ఆ నివాసంలో ఎవరు నిలబడలేరని లాలూ చేప్పినట్టు సుశీల్​ పేర్కొన్నారు. కానీ అదే ఇంట్లో ఉండి ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ 15ఏళ్ల పాటు రాష్ట్రాన్ని అభివృద్ధివైపు నడిపించారని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: